Sridevi: దుబాయ్ లో వేలానికి శ్రీదేవి వేసిన పెయింటింగ్స్!

  • పెయింటింగ్స్ వేయడం శ్రీదేవి హాబీ
  • సావరియా సినిమాలో ఫొటో, మైఖేల్ జాక్సన్ ఫొటోలను గీసిన శ్రీదేవి
  • 8 లక్షల ప్రారంభ ధరతో మైఖేల్ జాక్సన్ ఫొటో వేలానికి

అందాలతార శ్రీదేవి అద్భుతమైన నటి మాత్రమే కాదు, ఓ మంచి కళాకారిని కూడా. ఖాళీ సమయాల్లో ఆమె పెయింట్స్ వేస్తుండేవారు. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా 'సావరియా'లో ఒక ఫోటో శ్రీదేవికి చాలా బాగా నచ్చింది. దీంతో ఆ ఫొటోను ఆమె చిత్రంగా మలిచింది. పాప్ రారాజు, దివంగత మైఖేల్ జాక్సన్ చిత్రాన్ని కూడా ఆమె గీసింది.

మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో ఆమె పేర్కొంది. దుబాయ్‌ కి చెందిన అంతర్జాతీయ ఆర్ట్‌ హౌస్‌ ఆ రెండు పెయింటింగ్స్ ను చూసి ఆమెను సంప్రదించింది. ఆ పెయింటింగ్స్ ను వేలానికి పెట్టాలని కోరింది. అయితే, అందుకు శ్రీదేవి అంగీకరించలేదు. ఆ వేలం ద్వారా సమకూరిన డబ్బును ఒక ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో ఆమధ్య ఆమె తన చిత్రాలను వేలానికి ఇచ్చారు. మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ ను 8 లక్షల ప్రారంభ ధరతో త్వరలో వేలం వేయనున్నట్టు సదరు అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ తెలిపింది. 

More Telugu News