RGV: కన్నీరు పెట్టిస్తోన్న రామ్‌ గోపాల్‌ వర్మ పోస్ట్‌ చేసిన 'అమ్మా శ్రీదేవి' లేఖ!

  • బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయింది
  • నాలుగేళ్ల వయసు నుంచే బాల్యాన్ని కోల్పోయావ్
  • అమ్మానాన్నలని బిడ్డల్లా పోషించావు..
  • 16 ఏళ్ల వయసులోనే కృతిమ వెలుగుజిలుగుల మధ్య సున్నితత్వాన్ని కోల్పోయావ్‌

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి గురించి ట్వీట్లు చేస్తూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు. సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవికి వీడ్కోలు లేఖను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని అందులో ఉంది. 'నాలుగేళ్ల వయసు నుంచే బాల్యాన్ని కోల్పోయావ్, అమ్మానాన్నలని బిడ్డల్లా పోషించావు..16 ఏళ్ల వయసులోనే కృతిమ వెలుగుజిలుగుల మధ్య సున్నితత్వాన్ని కోల్పోయావ్‌.. నీ కోసం నీవెప్పుడూ బతకలేదనే విషయాన్ని కూడా మర్చిపోయావ్‌.. వచ్చే జన్మలో అయినా నీవు నీ కోసం పుట్టమ్మా' అంటూ రాసిన ఆ లేఖ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది. 'అమ్మా శ్రీదేవి' అంటూ అతిలోక సుందరిని అందులో సంబోధించారు. 

More Telugu News