Sridevi: శ్రీదేవిని కడసారి చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది : ప్రీతీ జింటా

  • ఈ భూగోళానికి మరోవైపున నేను ఉన్నాను
  • మై ఐకాన్ శ్రీదేవి వెళ్లిపోతోంది .. కాలి బూడిద కాబోతోంది
  • ఆమెకు ‘గుడ్ బై’ చెప్పలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది
  • ప్రీతీ జింటా ఆవేదన

సినీ నటి శ్రీదేవిని కడసారి చూసేందుకు రాలేకపోతున్నందుకు తాను చాలా బాధపడుతున్నానని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. తాను రాలేకపోవడానికి గల కారణాన్ని ఈ పోస్ట్ లో చెప్పింది.

‘శ్రీదేవికి అంతిమ వీడ్కోలు చెప్పేందుకు దాదాపు అందరూ ముంబైకు వెళ్లారని నాకు తెలుసు. ఈ భూగోళానికి మరోవైపున నేను ఉన్నాను. ఇప్పుడు అర్ధరాత్రి సమయం. నాకు నిద్రపట్టట్లేదు. నా చిన్ననాటి జీవితంలో భాగమైన, మై ఐకాన్ శ్రీదేవి వెళ్లిపోతోంది .. కాలి బూడిద కాబోతోంది. నా కళ్లు మూసుకుంటే.. ‘హవాహవాయి’ నన్ను చూసి చిరునవ్వులు చిందిస్తోంది.

ఆమె ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆమెకు ‘గుడ్ బై’ చెప్పలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. శ్రీదేవి మరణంపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి..ఇంతలా దిగజారిపోతున్న వారిని చూసి కోపం, బాధ తన్నుకు వస్తున్నాయి...శ్రీదేవీ ఎప్పటికీ ధ్రువ తారే. ఆమె ఎప్పటికీ నా హవాహవాయీనే...ఐ లవ్ యూ శ్రీదేవి’ అని ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేసింది.

More Telugu News