venkatesh: వెంకీ మూవీ కోసం శ్రియ తీసుకునే పారితోషికం ఎంతంటే..!

  • వెంకటేశ్ హీరోగా 'ఆట నాదే వేట నాదే'
  • కథానాయికగా శ్రియ
  • కాజల్ ను వద్దనుకోవడానికి కారణం అదే  

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా 'ఆట నాదే వేట నాదే' అనే సినిమా రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగనుంది. ఈ సినిమా కోసం కాజల్ ను కథానాయికగా తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆమెకి బదులుగా శ్రియను తీసుకున్నారు.

 తేజ తెరకెక్కించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కథానాయికగా కాజల్ చేసింది. ఆమెను మళ్లీ రిపీట్ చేయడం ఇష్టం లేకనే శ్రియను తీసుకున్నాడనే చెప్పుకుంటున్నారుగానీ, అసలు కారణం పారితోషికమేనని తెలుస్తోంది. కాజల్ ను సంప్రదిస్తే పారితోషికంగా కోటికి పైగా అడిగిందట. ఈ సినిమా ఆ స్థాయి బడ్జెట్ లోది కాదని చెప్పేసి, 60 లక్షలకి శ్రియను సెట్ చేశారట. ఈ మధ్య కాలంలో క్రేజ్ పరంగా శ్రియ మరింత పుంజుకోవడం కూడా ఆమె వైపు మొగ్గుచూపడానికి కారణమని అంటున్నారు.   

More Telugu News