pooja gandhi: 'దండుపాళ్యం 4' నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ రిలీజ్

  • ఆదరణ పొందిన 'దండుపాళ్యం' 
  • ఆ తరువాత వచ్చిన 2 .. 3 భాగాలు 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 4వ భాగం

తెలుగు తెరకు విభిన్నమైన కథలు పరిచయమవుతూ .. తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాయి. అలాంటి ప్రత్యేక చిత్రాల్లో 'దండుపాళ్యం' ఒకటిగా కనిస్తుంది. యథార్థ సంఘటనల సమాహారంగా ఈ కథ తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కారణంగానే ఈ కథకి సీక్వెల్ గా  2 .. 3 భాగాలు వచ్చాయి.

 తాజాగా 'దండుపాళ్యం 4' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మొదటి 3 భాగాలకు శ్రీనివాస రాజు దర్శకత్వం వహించగా, 4వ భాగానికి కె.టి. నాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ ను వదిలారు. పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.     

More Telugu News