Sridevi: ముంబై విమానాశ్రయానికి చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం

  • ప్రత్యేక విమానంలో దుబాయ్ నుంచి ముంబైకు తరలింపు
  • ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు
  • ఎయిర్ పోర్ట్ వద్ద అనిల్ కపూర్, అనిల్ అంబానీ, టీనా అంబాని

దుబాయ్ లో మృతి చెందిన ప్రముఖ సినీ నటి శ్రీదేవి భౌతికకాయం భారత్ చేరుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ కు ఈరోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె భౌతిక కాయం చేరుకుంది. ఆమె భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో దుబాయ్ నుంచి ఇక్కడికి తరలించారు. శ్రీదేవి భౌతికకాయం వెంట భర్త బోనీ కపూర్, కూతురు ఖుషీ కపూర్, సంజయ్ కపూర్, అర్జున్ కపూర్ ఉన్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు.

 ముంబై ఎయిర్ పోర్ట్ వద్దకు నటుడు అనిల్ కపూర్, ప్రముఖ వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ, టీనా అంబాని ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.తమ అభిమాన తార శ్రీదేవిని కడసారి చూసేందుకు ఆమె అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, అంధేరి వెస్ట్ లోని నివాసానికి శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించనున్నట్టు సమాచారం.

More Telugu News