Sridevi: నాడు శ్రీదేవిని సోదరి శ్రీలత మోసం చేసింది!: వర్మ

  • నాడు శ్రీదేవి తల్లికి అమెరికాలో బ్రెయిన్ సర్జరీ చేశారు
  • ఆ సర్జరీ సరిగా చేయలేదు.. ఆమె మెంటల్ పేషెంట్ అయిపోయారు
  • తల్లి చనిపోయే ముందు ఉన్న ఆస్తులన్నీ శ్రీదేవికే రాశారు
  • శ్రీదేవి సోదరి శ్రీలత కోర్టుకెక్కి ఆస్తులు సొంతం చేసుకుంది

ఆస్తుల విషయంలో శ్రీదేవిని సోదరి శ్రీలత నాడు మోసం చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’ అంటూ వర్మ పోస్ట్ చేసిన లేఖలో నాటి విషయాన్ని ప్రస్తావించారు. ‘నాడు శ్రీదేవి తల్లికి అమెరికాలో బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆ సర్జరీ సరిగా చేయకపోవడంతో ఆమె మెంటల్ పేషెంట్ అయిపోయారు. శ్రీదేవి సోదరి శ్రీలత తమ పక్కింటి కుర్రాడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే, శ్రీదేవి తల్లి చనిపోయే ముందు ఆస్తులన్నీ శ్రీదేవి పేరు మీదనే రాశారు. ఈ వీలునామా రాసే సమయంలో తన తల్లి మానసిక వ్యాధిగ్రస్తురాలని పేర్కొంటూ శ్రీదేవిపై కేసు వేసిన శ్రీలత ఆ ఆస్తిని చేజిక్కించుకుంది. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవికి బోనీ తప్ప ఆమె చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది..’ అని ఆ లేఖలో వర్మ చెప్పుకొచ్చారు.

More Telugu News