mumbai: శ్రీదేవి భౌతికకాయం కుటుంబ సభ్యులకు అప్పగింత.. ముంబయిలోని ఇంటివద్ద భారీగా భద్రత!

  • ముగిసిన ఎంబామింగ్ ప్రక్రియ
  • ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్న భౌతికకాయం
  • ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకుంటోన్న అభిమానులు

దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి భౌతిక కాయానికి ఎంబామింగ్ ప్రక్రియ ముగిసింది. ఆమె బంధువులకు భౌతికకాయాన్ని అప్పగించారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళుతున్నారు. ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల తర్వాత ఆమె భౌతికకాయం ముంబయి చేరుకుంటుంది.

ఈ నేపథ్యంలో తమ అభిమాన తారకి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబయిలోని ఆమె నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషికపూర్‌ ఇంటి వద్దే ఉన్నారు. రేపు పవన్‌హాన్స్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

More Telugu News