Allu Arjun: శ్రీదేవి మృతిపై రూమర్లు ఇక ఆపండి: అల్లు అర్జున్‌, కాజల్ ఆగ్రహం

  • శ్రీదేవి మృతిపై అసభ్య ప్ర‌చారం ప‌ట్ల సినీన‌టులు ఆగ్ర‌హం
  • మీడియాతో పాటు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాను ఇక ఆపండి: బన్ని
  • ఊహాగానాలు, రూమ‌ర్లు వద్దు: కాజల్‌

సినీన‌టి శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి, మునిగి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీక‌రించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆమె మృతిపై రూమ‌ర్లు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. ఆ ప్ర‌చారం ప‌ట్ల సినీన‌టులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీదేవి మృతిపై విప‌రీతంగా అస‌త్య‌ ప్ర‌చారాలు వ‌స్తున్నాయ‌ని సినీన‌టుడు అల్లు అర్జున్ అన్నాడు.

ఆమె మృతి ప‌ట్ల ఇటువంటి ప్ర‌చారాలు చేయొద్ద‌ని, మీడియాతో పాటు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాన‌ని ట్వీట్ చేశాడు. మృతి చెందిన వారి పట్ల కనీస గౌరవం చూపాలని అన్నాడు. ఇదే విష‌యంపై హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ట్వీట్ చేస్తూ... శ్రీదేవి మృతిపై ప్ర‌చారం అవుతోన్న ఊహాగానాలు, రూమ‌ర్లు ఆపాల‌ని తాను సీరియ‌స్ గా కోరుతున్నాన‌ని పేర్కొంది. వారితో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఇదే విషయంపై ట్వీట్లు చేస్తూ ఇటువంటి విషాద స‌మ‌యంలో శ్రీదేవి మృతిపై గాసిప్స్ ప్రచారం చేయ‌డం స‌భ్య‌త కాద‌ని పేర్కొంటున్నారు.   

More Telugu News