Sridevi: శ్రీదేవి మృతిపై ఊహాగానాలు ఆపండి: హీరోయిన్ మెహ్రీన్

  • ఒకరి మృతిని అపహాస్యం పాలు చేసేలా వ్యాఖ్యలు వద్దు
  • తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదు
  • శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలి
  • మానవత్వం గల మనుషులుగా ప్రవర్తిద్దాం : మెహ్రీన్ ట్వీట్

ప్రముఖ నటి శ్రీదేవి మృతిపై  పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా స్పందించింది. ఒకరి మృతిని అపహాస్యం పాలు చేసేలా వ్యాఖ్యలు, అనుమానాలు, ఊహాగానాలు చేయడం ఆపాలని, తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని పేర్కొంది. అటువంటి ఆలోచనా ధోరణి ఉన్న వారు దానికి స్వస్తి పలకాలని కోరుతూ ఓ ట్వీట్ చేసింది. దయచేసి, శ్రీదేవి ఆత్మకు శాంతి కలిగించేలా నడుచుకోండంటూ విజ్ఞప్తి చేసింది. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, మానవత్వం గల మనుషులుగా ప్రవర్తిద్దామని ఆ ట్వీట్ లో మెహ్రీన్ సూచించింది.

More Telugu News