Sridevi: దుబాయ్‌ చేరుకున్న బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్

  • తొలిసారిగా స్పందించి ఈ విషయమై ప్రకటన చేసిన శ్రీదేవి కుటుంబం
  • బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కుమారుడు అర్జున్ కపూర్
  • బోనీ కపూర్‌ను పోలీసులు విచారిస్తోన్న నేపథ్యంలో దుబాయ్‌కు అర్జున్‌ కపూర్‌

దుబాయ్‌లో సినీనటి శ్రీదేవి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి కుటుంబం నుంచి మొద‌టిసారిగా అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందని జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ పేర్కొంది. అ ప్ర‌క‌ట‌న‌లో బోనీ క‌పూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ దుబాయ్ చేరుకున్నార‌ని పేర్కొన్నారు. శ్రీదేవి మృతి కేసులో అక్కడి పోలీసులు బోనీ కపూర్‌ని విచారిస్తోన్న నేపథ్యంలో తండ్రికి సాయంగా ఉండడానికి అర్జున్ కపూర్ అక్కడకు చేరుకున్నారని తెలిసింది.

కాగా, బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కుమారుడు అర్జున్ కపూర్ కూడా సినిమా నటుడే. మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చిన అనంత‌రం బోనీ కపూర్ 1996లో శ్రీదేవిని వివాహ‌మాడారు. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి 2012 మార్చి 5న కేన్సర్ కార‌ణంగా మృతిచెందింది. మరోవైపు, శ్రీదేవి మృతిపై అనుమానాలు వ‌స్తోన్న నేప‌థ్యంలో యూఏఈలోని భారతీయ దౌత్యవేత్త నవదీప్ సూరి ఆ ఆరోప‌ణ‌లు ఖండించారు.  

More Telugu News