nithin: 'శ్రీనివాస కల్యాణం' మూవీకి ముహూర్తం ఖరారు

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
  • మార్చి 3వ తేదీన ప్రారంభం 
  • 23 నుంచి రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం నితిన్ .. కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ .. పవన్ .. నితిన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోంది. ప్రేమకథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మార్చి 3వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అదే నెల 23వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా కోసం కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేతలను ఎంపిక చేసుకున్నారు. 

More Telugu News