stock markets: ఆటో, రియాల్టీల అండ.. స్టాక్ మార్కెట్ల జోరు!

  • వరుసగా రెండో సెషన్లో లాభాలు
  • 304 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 92 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్ లో కూడా జోరు కొనసాగించాయి. ఆటో, రియాల్టీ స్టాకుల అండతో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 34,446కు పెరిగింది. నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 10,583 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
:
ఒబెరాయ్ రియాల్టీ (16.21%), ఆస్ట్రాల్ పాలీ టెక్ (8.41%), చంబల్ ఫర్టిలైజర్స్ (8.26%), రిలయన్స్ కమ్యూనికేషన్ (7.99%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (6.90%).

టాప్ లూజర్స్:
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (-10.02%), వక్రాంగీ (-5.00%), జైప్రకాష్ అసోసియేట్స్ (-4.69%), సన్ ఫార్మా (-3.97%), వీడియోకాన్ ఇండస్ట్రీస్ (-3.64%).          

More Telugu News