airplane: పేలిన పవర్ బ్యాంక్.. విమానంలో మంటలు!

  • బ్యాగులో ఉంచిన పవర్ బ్యాంక్ పేలుడు
  • భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు
  • మంటలను ఆర్పివేసిన సిబ్బంది

మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం ఉపయోగించే పవర్ బ్యాంక్ విమానంలో పేలిపోయిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా సదరన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు ఇంకా విమానం ఎక్కుతుండగానే ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్ లో ఉంచిన బ్యాగులోని పవర్ బ్యాంక్ పేలిపోయింది. దాంతో బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి.

ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే, వెంటనే స్పందించిన విమాన సిబ్బంది వాటర్ బాటిల్ నీళ్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. పవర్ బ్యాంక్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. అయితే, ఉపయోగించకుండా ఖాళీగా బ్యాగులో ఉంచిన సమయంలో ఇది పేలడం చర్చనీయాంశమైంది. ఇది ఎందుకు పేలిందనే దానిపై పరిశీలన జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News