Sridevi: శ్రీదేవి భౌతికకాయాన్ని ఇంకా కుటుంబ సభ్యులకు అప్పగించని దుబాయ్‌ పోలీసులు!

  • తుది నివేదిక రూపొందించాకే అప్పగిస్తామంటోన్న పోలీసులు
  • తరలింఫు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న భారత రాయబార కార్యాలయం
  • ఈ రోజు రాత్రికి భౌతిక కాయం చేరుకునే అవకాశం

శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు అప్పగించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. నిన్నటి నుంచి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి కాలేదంటూ దుబాయ్ వైద్యులు ఆలస్యం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడి పోలీసుల కారణంగా మరింత ఆలస్యం జరుగుతోంది. శ్రీదేవి భౌతికకాయాన్ని ఇప్పుడే అప్పగించబోమని ఆమె కుటుంబ సభ్యులకు దుబాయ్ పోలీసులు చెప్పారు. తాము తుది నివేదిక రూపొందించాకే బాడీని అప్పగిస్తామని అన్నారు. శ్రీదేవి భౌతికకాయం తరలింఫు ఏర్పాట్లను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ఈ రోజు రాత్రికి శ్రీదేవి భౌతిక కాయం ముంబయ్ చేరుకునే అవకాశం ఉంది.

More Telugu News