Sridevi: శ్రీదేవి బస చేసిన హోటల్ గది సీజ్... సోషల్ మీడియాలో భిన్న కథనాలు!

  • సోషల్ మీడియాలో పుకార్ల హల్ చల్
  • జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ లో శ్రీదేవి బస చేసిన హోటల్ గది సీజ్
  • ఆ సూట్ మొత్తాన్ని క్రూషియల్ స్పాట్ గా గుర్తించిన పోలీసులు

నటి శ్రీదేవి మృతదేహం అప్పగింతలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మేనల్లుడి వివాహం నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బస చేసిన జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌ గదిని అక్కడి పోలీసులు సీజ్‌ చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె బస చేసిన సూట్‌ మొత్తాన్ని ‘క్రూషియల్‌ స్పాట్‌’ గా గుర్తించారని, దీనిపై స్పందించేందుకు హోటల్ యాజమాన్యం నిరాకరిస్తోందని పేర్కొంటూ కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సాధారణ ప్రక్రియలో భాగంగానే పోలీసులు హోటల్ లో ఆమె బస చేసిన గదిని పరిశీలించినట్టు తెలుస్తోంది. కాగా, ముంబైలో ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ముంబై జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

More Telugu News