Sridevi: బోనీ కపూర్ కు శ్రీదేవితో రాఖీ కట్టించిన మిథున్ చక్రవర్తి!

  • తొలుత మిథున్ తో లవ్ అఫైర్
  • బోనీతో అఫైర్ ఉందని భావించిన మిథున్
  • దగ్గరుండి రాఖీ కట్టించాడు

పెళ్లికాక ముందు బోనీ కపూర్ కు శ్రీదేవి రాఖీ కట్టిందనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. బోనీ కపూర్ కన్నా ముందు మిథున్ చక్రవర్తిని ప్రేమించింది శ్రీదేవి. అయితే, బోనీ కపూర్ కు, శ్రీదేవికి మధ్య ఏదో ఉందనే అనుమానం మిథున్ కు కలిగింది. దీంతో, ఆమె చేత బోనీకి రాఖీ కట్టించారట. శ్రీదేవి కూడా తన ప్రేమ కోసం బోనీకి రాఖీ కట్టారట. ఆ తర్వాత కాలంలో శ్రీదేవి, మిథున్ ల ప్రేమాయణం ముగిసిపోయింది. అప్పటికే బోనీ కపూర్ వివాహితుడు. ఇదే సమయంలో శ్రీదేవితో అఫైర్ నడిపాడు. ఫలితంగా పెళ్లి కాకుండానే శ్రీదేవి గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో, వివాదాస్పద పరిస్థితుల మధ్య 1996లో బోనీ, శ్రీదేవిలు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

More Telugu News