Lakshmi Parvathi: శ్రీదేవి జీవితం ధన్యమైంది!: లక్ష్మీపార్వతి

  • దేశం మొత్తం కన్నీరుపెడుతోంది
  • ఇంతకంటే ఇంకేం కావాలి
  • శ్రీదేవితో ఎన్టీఆర్ ఓ పౌరాణిక చిత్రం చేయాలనుకున్నారు

శ్రీదేవి మరణవార్తకు ఇంతమంది స్పందిస్తున్నారంటే ఆమె జీవితం ధన్యమైనట్టేనని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. శ్రీదేవి మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు చెప్పిన లక్ష్మీపార్వతి ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కళ్లముందు కనిపిస్తున్నా నమ్మలేని విషయాల్లో శ్రీదేవి మరణం ఒకటని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీదేవికి ఎన్టీఆర్ వీరాభిమాని అని గుర్తు చేసుకున్నారు. ‘వైదేహి’ అనే కథతో ఎన్టీఆర్ శ్రీదేవితో ఓ సినిమా చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదని తెలిపారు. ఆ సినిమాలో శ్రీదేవి సీతగా, ఎన్టీఆర్ రాముడిగా చేయాలనుకున్నారని వివరించారు. శ్రీదేవిని తాను చివరిసారి చెన్నైలో కలిసినట్టు చెప్పారు. నిండైన మనసున్న శ్రీదేవి చాలా తక్కువగా మాట్లాడతారని, అటువంటి వ్యక్తి చనిపోయారన్న వార్తను తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

More Telugu News