Hyderabad: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా.. హైదరాబాద్‌లో బయటపడ్డ నిజాం కాలంనాటి సొరంగం

  • డబీర్‌పురాలో ఘటన
  • సొరంగాన్ని చూడడానికి భారీగా తరలి వస్తోన్న ప్రజలు
  • చేరుకున్న పోలీసులు, పునరావస్తు శాఖ అధికారులు

హైదరాబాద్‌లోని డబీర్‌పురాలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఓ సొరంగం బయటపడింది. దీంతో ఆ సొరంగాన్ని చూడడానికి స్థానికులు భారీగా తరలివస్తున్నారు. ఆ సొరంగంలో నిజాం కాలం నాటి పలు వస్తువులు కనపడ్డాయి. అందులో ఫిరంగి తూటాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. పురావస్తుశాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ సొరంగం గురించి పునరావస్తు శాఖ అధికారులు పరిశోధన మొదలుపెట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

More Telugu News