sridevi: శ్రీదేవి చివరి సినిమా 'జీరో'.. వచ్చే డిసెంబర్లో రానుంది!

  • 2017లో విడుదలైన శ్రీదేవి 'మామ్' సినిమా
  • షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'జీరో'లో కనిపించనున్న శ్రీదేవి
  • షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్‌ లతో కలిసి సందడి చేయనున్న శ్రీదేవి

'సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా! చిన్నారి చిలకమ్మా... నీ వాడు ఎవరే? నీతోడు ఎవరే? ఎన్నాళ్లకొస్తాడే?' అంటూ ఒకప్పుడు యువతకు గిలిగింతలు పెట్టిన వెండితెరవేల్పు శ్రీదేవి చివరగా నటించి మెప్పించిన సినిమా 'మామ్' అన్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆమె చివరి సినిమా కాదని బాలీవుడ్ సమాచారం. ఆమె చివరి సినిమా షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'జీరో' అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పూర్తి స్థాయి పాత్ర పోషించనప్పటికీ...చివరి సారి ఆమె ప్రేక్షకులను పలకరించేది మాత్రం ఈ సినిమాతోనేనని సమాచారం.

 'జీరో' సినిమాలో ఆమె నిజజీవిత పాత్రలోనే (స్టార్ హీరోయిన్ శ్రీదేవిగా) కనిపించబోతున్నారట. ఓ పార్టీ సీన్‌ గా కనిపించే ఈ సన్నివేశంలో షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్‌ లతో కలిసి ఆమె సందడి చేస్తారని, దీనికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తైందని బాలీవుడ్ కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, వచ్చే డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, రాయ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీంతో శ్రీదేవి చివరి సినిమా 'మామ్' కాదు 'జీరో' అని తెలుస్తోంది.  

More Telugu News