sridevi: జుహూ శ్మశానవాటికలో అతిలోకసుందరి అంత్యక్రియలు.. జరుగుతున్న ఏర్పాట్లు

  • మధ్యాహ్నం 3 గంటలకు ముంబై చేరుకోనున్న భౌతికకాయం
  • జుహూ శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
  • శ్రీదేవి నివాసం వద్దకు పోటెత్తుతున్న అభిమానులు

ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమతోపాటు అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. నిన్న రాత్రి ఆమె దుబాయ్ లో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబై చేరుకోనుందని సమాచారం. జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోగానే ఆమె అంత్యక్రియలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు చేరుకుంటున్నారు. తాము ఎంతగానో ఆరాధించిన అతిలోకసుందరిని చివరిసారి చూడాలని ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. 

More Telugu News