sridevi: శ్రీదేవి, జయప్రదల మధ్య రాజీ కుదిర్చేందుకు విఫలయత్నం చేసిన రాజేష్ ఖన్నా, జితేంద్ర

  • శ్రీదేవి, జయప్రదల మధ్య బద్ధ వైరం
  • దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లినా కొనసాగిన వైరం
  • సయోధ్య కుదిర్చేందుకు విఫలయత్నం చేసిన రాజేష్ ఖన్నా, జితేంద్ర

సినీపరిశ్రమలో శ్రీదేవి, జయప్రదల మధ్య ఉన్నంత వైరం మరెవరి మధ్య ఉండకపోవచ్చు దక్షిణాది సినిమాలలో నటిస్తున్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య పోటీ ఉంది. అందం, అభినయం, ఇలా ఏ విధంగా చూసినా ఇద్దరిదీ ఒకే స్థాయి. దక్షిణాదిలో వీరి మధ్య ఉన్న వృత్తిపరమైన వైరం... బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత కూడా కొనసాగింది. బాలీవుడ్ లో కూడా శ్రీదేవికి పోటీగా జయప్రద నిలబడ్డారు.

ఈ నేపథ్యంలో అగ్రకథానాయికలైన వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆనాటి సూపర్ స్టార్లు రాజేష్ ఖన్నా, జితేంద్రలు ప్రయత్నించారు. 1984లో ఇది చోటు చేసుకుంది. ఇద్దరినీ ఒకే రూములో పెట్టి, బయట తాళం వేసేశారు. ఆ సమయంలో కూడా వీరిద్దరూ మాట్లాడుకోకుండా, ఎవరిమానాన వారు కూర్చున్నారు. తాళం తీసేంతవరకు మౌనంగానే ఉన్నారు. 

More Telugu News