Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'కణం' కొత్త అనుభూతి అంటున్న సాయిపల్లవి 
  • వరుణ్ తేజ్ ఖాతాలో మరో రికార్డు 
  • బరువు పెరగలేదంటున్న కీర్తి సురేశ్
  • బిజినెస్ లో చరణ్ సినిమా దూకుడు

*  తాజాగా తాను చేసిన 'కణం' సినిమా భావోద్వేగాలతో సాగుతుందని చిత్ర కథానాయిక సాయిపల్లవి చెప్పింది. ప్రేక్షకులకు ఇదొక కొత్త అనుభూతిని కలిగించే చిత్రమని అంది. ఇందులో నాలుగేళ్ల పిల్లకు తల్లిగా సాయిపల్లవి నటించింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మార్చ్ 3న విడుదల చేస్తున్నారు.
*  వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'తొలిప్రేమ' సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా రికార్డు నెలకొల్పింది. ఫిదా చిత్రం తర్వాత మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిన వరుణ్ మరో సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది.  
*  సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రం కోసం తాను బరువు పెరిగినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పింది కథానాయిక కీర్తి సురేశ్. వాస్తవానికి సావిత్రి యువతిగా కనిపించే సందర్భంలో నటించడం కోసం కాస్త బరువు తగ్గానని, పెద్దయ్యాక కనిపించే సందర్భంలో మాత్రం మేకప్ రీత్యా అడ్జస్ట్ చేశారని కీర్తి చెప్పింది.
*  రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూడో షెడ్యూల్ షూటింగుకి రెడీ అవుతోంది. వచ్చే నెల 8 నుంచి మొదలయ్యే ఆ షెడ్యూల్ లో హీరో చరణ్ జాయిన్ అవుతాడు. విశేషం ఏమిటంటే, ఇప్పటికే ఈ చిత్రం తెలుగు శాటిలైట్, హిందీ డబ్బింగ్, హిందీ శాటిలైట్ హక్కుల ద్వారా 47 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

More Telugu News