Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఇట్టే నేర్చేసుకున్నానంటున్న అనుపమ 
  • బి.నాగిరెడ్డి పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల 
  • కల్యాణ్ రామ్ 'నా నువ్వే' రిలీజ్ డేట్ ఖరారు 
  • ఉగాదికి మహేశ్ బాబు టీజర్    

*  తెలుగు భాష నేర్చుకోవడానికి నాకు అట్టే సమయం పట్టలేదు.. అంటోంది మల్లూ బేబీ అనుపమా పరమేశ్వరన్. "సినిమాల్లోకి రాకముందు నేను అందరితోనూ ఇట్టే కలిసేదాన్ని కాదు. అయితే, తెలుగు వాతావరణానికి మాత్రం కలసిపోయాను. ఓ విధంగా చెప్పాలంటే, ఇక్కడి మనుషులే నన్ను అలా కలిపేసుకున్నారేమో. అందుకే తెలుగు నేర్చుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు" అని చెప్పింది అనుపమ.      
*  విజయావాహిని బ్యానర్ పై పలు కళాఖండాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దివంగత బి.నాగిరెడ్డి స్మారకార్థం పోస్టల్ శాఖ ఓ తపాలా బిళ్ళను విడుదల చేసింది. నిన్న సాయంకాలం చెన్నయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పోస్టల్ స్టాంప్ ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
*  నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటిస్తున్న 'నా నువ్వే' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 18న విడుదల చేయడానికి నిర్మాతలు డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం లండన్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్ ను ఉగాదికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేస్తారు.       

More Telugu News