Hyderabad: హైదరాబాద్‌ మెట్రో రైలులో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.1.50 కోట్లు వసూలు

  • ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
  • ఏబీసీ అనే పేరుతో కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకుని మోసం
  • ఉద్యోగాలు ఇప్పించకుండా నాటకాలు

హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది. నిరుద్యోగుల నుంచి మొత్తం రూ.1.50 కోట్లు తీసుకుంది. మంచి ఉద్యోగం వస్తుందంటూ ఎదురు చూసిన యువకులకు ఎంతకీ ఆ జాబ్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో తాము డబ్బులు చెల్లించిన సంస్థ ప్రతినిధులను అడిగితే వారు త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని బాధితులు చెప్పారు. ఈ ఘటనపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏబీసీ అనే పేరుతో కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకుని తమను మోసం చేశారని వివరించారు. 

More Telugu News