krish: క్రిష్ - వరుణ్ తేజ్ మూవీకి భారీ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు

  • క్రిష్ నిర్మాణంలో వరుణ్ తేజ్ 
  • దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి 
  • అప్పుడే పూర్తయిన ఓవర్సీస్ బిజినెస్

హిందీలో 'మణికర్ణిక' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్న దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డితో కలిసి తెలుగులో ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందనుంది. క్రిష్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది. ఆయన నిర్మిస్తోన్న ఈ సినిమాకి కూడా అక్కడ మంచి డిమాండ్ ఉందట.

 అందువల్లనే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 2.75 కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇక గతంలో సంకల్ప్ రెడ్డి చేసిన 'ఘాజీ' సినిమా కూడా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగా కూడా ఓవర్సీస్ రైట్స్ ఈ రేటుకు అమ్ముడైనట్టు చెబుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు 18 కోట్లను ఆఫర్ చేశారనేది తాజా సమాచారం. కంటెంట్ పై గల నమ్మకమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు.        

More Telugu News