kothapalli subbarayudu: తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు!

  • హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
  • సుబ్బారాయుడి ఆరోగ్యం గురించి వాకబు చేసిన చంద్రబాబు
  • మెరుగైన వైద్యం అందించాలంటూ డాక్టర్లను కోరిన సీఎం

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, వెంటనే ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సుబ్బరాయుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మంచి వైద్యం అందించి, ఆయన త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.


More Telugu News