Rajasthan: చనిపోయిన ఎమ్మెల్యేలు దెయ్యాలై తిరుగుతున్నారట... రాజస్థాన్ సెక్రటేరియేట్ కు రానేరామంటున్న ఎమ్మెల్యేలు!

  • 2001లో నిర్మించిన రాజస్థాన్ సచివాలయం
  • అంతకుముందు ఆ ప్రాంతం శ్మశానమట
  • అందుకే చనిపోయిన ఎమ్మెల్యేలు దెయ్యాలయ్యారని ఎమ్మెల్యేల అనుమానం 

చనిపోయిన ఎమ్మెల్యేల ఆత్మలతో పాటు దెయ్యాలు, భూతాలు రాజస్థాన్ సచివాలయంలో తిరుగుతున్నాయట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. రాజస్థాన్ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలే. ఇటీవల చనిపోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్మలుగా మారి తిరుగుతున్నారని, చాలా మందికి కనపడ్డారని చెబుతూ, సెక్రటేరియేట్ లోకి అడుగు పెట్టేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. వెంటనే సీఎం వసుంధరా రాజే స్పందించి, భూత వైద్యులను పిలిపించాలని, వివిధ మతాల ప్రార్థనలు జరిపించి, దెయ్యాలను తరిమివేయలేకపోతే తాము రాలేమని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

కాగా, ఈ సెక్రటేరియేట్ ను 2001లో నూతనంగా నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ శ్మశానం ఉండేదట. అందువల్లే చనిపోయిన ఎమ్మెల్యేలు దెయ్యాలై ఇక్కడ తిరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. వాటిని తరిమేందుకు ప్రత్యేక పూజలు చేయాలని తాను రాజేకు చెప్పినట్టు ఆయన తెలిపారు.

More Telugu News