Andhra Pradesh: వచ్చేనెల‌ 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జీవో విడుద‌ల‌

  • అమరావతి వెలగపూడిలో సమావేశాలు
  • మార్చి 5వ తేదీ ఉదయం రూ.9.30 నిమిషాల నుంచి ప్రారంభం
  • జీవో నెం.4, 5లను విడుదల చేసిన ప్రభుత్వం

వచ్చే నెల 5 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 లను విడుదల చేసింది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అమరావతి వెలగపూడిలో జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 5వ తేదీ (సోమవారం) ఉదయం రూ.9.30 నిమిషాల నుంచి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఈ రోజు విడుదల చేసిన జీవోల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, రాష్ట్ర‌ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే విష‌యంపై రాష్ట్ర మంత్రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే.

More Telugu News