Train Accident: కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ.. తప్పిన ప్రాణాపాయం

  • ముంబయి రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయిన వైనం
  • రక్షించిన రైల్వే సిబ్బంది

ముంబయి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళకు పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కబోయిన సదరు మహిళ... రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆమెను అక్కడి నుంచి లాగేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో చైను లాగి రైలును కాసేపు ఆపేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రైలు కదులుతుండగా దాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన ఆమె.. డోర్‌ను గట్టిగా పట్టుకుని అలాగే పరుగులు తీయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.   

More Telugu News