Rajasthan: యువకుడిని కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలు పెట్టి చంపేసిన వైనం.. మీడియాకు చిక్కిన దృశ్యాలు

  • రాజస్థాన్‌లోని బార్మర్‌ ప్రాంతంలో అతి దారుణ ఘటన
  • వ్యక్తిగత వివాదాల కారణంగా హత్య
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

రాజ‌స్థాన్‌లోని బార్మర్‌ ప్రాంతంలో అతి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కొంత మంది వ్యక్తులు అతడిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. బార్మర్ ప్రాంతంలో ఓ వ్యక్తి కొనప్రాణంతో పడి ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది.

అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆ వ్యక్తిని చిత్రహింసలు పెడుతుండగా నిందితులు సెల్‌ఫోన్‌లో తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తిగతంగా ఉన్న వివాదాల కారణంగానే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిసింది.  

More Telugu News