bellamkonda srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త రూట్లోకే అడుగుపెట్టాడు!

  • ప్రస్తుతం సెట్స్ పై 'సాక్ష్యం' సినిమా
  • కొత్త దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ   

'జయ జానకి నాయక'తో హిట్ కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ప్రస్తుతం 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఇప్పటివరకూ బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి ప్రాధాన్యతనిస్తూ .. అదే తరహా కథలతో అలరిస్తూ వచ్చాడు. ఈ సినిమా మాత్రం యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్భుతమనీ .. ఆడియన్స్ ను కట్టిపడేస్తుందనీ, తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని బెల్లంకొండ శ్రీనివాస్ చెబుతున్నాడు.       

More Telugu News