iyr krishna rao: మరో పదవి నుంచి ఐవైఆర్ కు ఉద్వాసన పలికిన ఏపీ సర్కార్

  • ఏపీ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ సంస్థ పదవి నుంచి తొలగింపు
  • ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ పదవిపై వేటు
  • ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఐవైఆర్

ఏపీ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఆ పదవి నుంచి ఐవైఆర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

బ్రాహ్మణులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు... ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో, ఆయనకు ఉద్వాసన పలికారు. ఇప్పటికే ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

More Telugu News