maha news: మహాన్యూస్‌పై దాడి అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్

  • మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడి
  • మహా న్యూస్ వాహనాల ధ్వంసం 
  • విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
  • ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు-పవన్

ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛానెల్ మ‌హాన్యూస్ సిబ్బంది, వాహనాలపై విజయనగరంలో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిని ఖండిస్తూ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 'మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని, మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది' అని పవన్ పేర్కొన్నారు.  

More Telugu News