north eastern states: పక్కా ప్లాన్ తో చైనా, పాకిస్థాన్ లు ఈ పని చేస్తున్నాయి: ఆర్మీ చీఫ్

  • ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల వలసలు పెరిగిపోతున్నాయి
  • చైనా అండతో పాక్ ఈ వలసలను ప్రోత్సహిస్తోంది
  • అసోంలో బీజేపీ కన్నా అక్కడి ముస్లిం పార్టీ వేగంగా ఎదుగుతోంది

ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల అక్రమ వలస పెరుగుతోంది. దీనికి సంబంధించి భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వాస్తవాలను వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే చైనా సాయంతో పాకిస్థాన్ ఈ వలసలను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత నెలకొనేలా చేయడమే వారి లక్ష్యమని చెప్పారు. పెరిగిపోతున్న బంగ్లాదేశీయుల వలసల గురించి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసోంలో ముస్లింల జనాభా అమాంతం పెరిగిపోతుండటంపై కూడా ఆయన స్పందించారు. అసోంలో బీజేపీ కన్నా ఏఐయూడీఎఫ్ అనే ముస్లిం పార్టీ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలమని తెలిపారు.

More Telugu News