Kamal Haasan: కమల్ బహిరంగ సభ వద్ద తప్పిన ప్రమాదం!

  • మధురైలోని ఒత్తకడాయ్ మైదానంలో అపశ్రుతి 
  • కిందపడిపోయిన భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు
  • ఎటువంటి ప్రమాదం జరగలేదన్న పోలీసులు

విలక్షణ నటుడు కమలహాసన్ తన రాజకీయపార్టీ పేరు ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మధురైలోని ఒత్తకడాయ్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కమల్ ప్రసంగాన్ని వీక్షించే నిమిత్తం అక్కడి మైదానంలో భారీ ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

అయితే, ఉన్నపళంగా భీకరమైన గాలులు రావడంతో ఎల్ ఈడీ స్క్రీన్ లు కిందపడిపోయాయి. ఈ సంఘటనలో ఎవరికి ప్రమాదం వాటిల్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు తెలిపారు. కాగా, స్థానిక కళాకారులు కమల హాసన్ చిత్రాలతో ఉన్న టీషర్టులను ధరించి ఆడిపాడుతున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.  

More Telugu News