charan: థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగనున్న 'రంగస్థలం'?

  • 'రంగస్థలం'లో ప్రేమకథా కోణం 
  • ఆనాటి రాజకీయాల ప్రస్తావన 
  • హత్యా కోణంలోనూ ఆసక్తికర మలుపులు

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ .. సమంత జంటగా నటించిన 'రంగస్థలం' చిత్రాన్ని వచ్చేనెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. దాంతో అంతా ఇది పల్లెలో జరిగే ప్రేమకథ అనుకున్నారు. ఇక ఈ సినిమాలో 1985 కాలంనాటి రాజకీయాల ప్రస్తావన కూడా వుంటుందనే విషయం ఈ మధ్యనే బయటికివచ్చింది.

ఇక ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలోనే ఎక్కువగా కొనసాగనుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో చిట్టిబాబు సోదరుడు హత్యకి గురవుతాడు. ఆ హత్యకి కారకులు ఎవరనే విషయాన్ని తెలుసుకోవడం కోసం, వినికిడి లోపం కలిగిన చిట్టిబాబు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిస్తోంది. మొత్తానికి ఈ సినిమాను లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ .. థ్రిల్లర్ నేపథ్యంలో సుకుమార్ తీర్చిదిద్దాడనే విషయం అర్థమవుతోంది.     

More Telugu News