chinta mohan: వాళ్లిద్దరూ అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదు: మాజీ ఎంపీ చింతా మోహన్

  • కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నంత కాలం ప్రత్యేకహోదా రాదు
  • అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు లేదు : చింతా మోహన్
  • హోదా సాధన కోసం చంద్రబాబు కార్యాచరణను తెలియజేయాలి
  • కలిసి వచ్చే పార్టీలతో పోరాటం ఉద్ధృతం చేస్తాం : సీపీఎం నేత మధు

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా రాదని మాజీ ఎంపీ చింతా మోహన్ తేల్చిచెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదా సాధించడంపై లేదని అన్నారు. గత ఏడాది బడ్జెట్ ను రూ.1.76 లక్షల కోట్లుగా చూపించారని, రాష్ట్రంలో ఏం పనులు చేశారో మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.

కాగా, సీపీఎం నేత మధు మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు కార్యాచరణ ఏంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కలిసి వచ్చే పార్టీలతో పోరాటం ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపారు.

More Telugu News