iphone se2: యాపిల్ నుంచి బడ్జెట్ ఫోన్ ఎస్ఈ2... 4.2 అంగుళాల డిస్ ప్లే, ఈ ఏడాదే ఆవిష్కరణ!

  • డబ్ల్యూ డబ్ల్యూడీసీ డెవలపర్స్ సదస్సులో ఆవిష్కరణ 
  • వచ్చే జూన్ లో జరగనున్న సదస్సు
  • క్యుక్యు అనే సంస్థ కథనం

యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ2 మోడల్ ను ఈ ఏడాది జూన్ లో జరిగే డబ్ల్యూడబ్ల్యూడీసీ డెవలపర్స్ సదస్సులో ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు క్యుక్యు అనే సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఏ10 ఎస్ వోసీ, 4.2 అంగుళాల డిస్ ప్లేతో ఈ మోడల్ పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 32జీబీ, 128జీబీ వెర్షన్ లతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆధారిత హోమ్ బటన్ ఉంటాయి. ఇందులో 3డీ సెన్సింగ్ ఫీచర్, వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండదని చైనాకు చెందిన కేజీఐ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్ చి క్యూ అన్నారు. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ప్రస్తుతం రూ.20,000 స్థాయిలో విక్రయమవుతున్న విషయం తెలిసిందే. కొత్త మోడల్ ధర కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా.

More Telugu News