Instagram: క్రికెటర్ కుల్ దీప్ యాదవ్ ఖాతాను హ్యాక్ చేసి అశ్లీల ఫోటోలు పోస్టు చేసిన సైబర్ నేరగాళ్లు

  • భారత జట్టులో బౌలర్ గా రాణిస్తున్న కుల్ దీప్
  • ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో చిత్రాన్ని చూసి అభిమానుల అవాక్కు
  • విషయం చెప్పి అర్థం చేసుకోవాలని కోరిన కుల్ దీప్

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్ గా రాణిస్తున్న కుల్ దీప్ యాదవ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దానిలో అశ్లీల ఫొటోలు ఉంచారు. ఇన్ స్టాగ్రామ్ లో కుల్ దీప్ కు 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, సైబర్ నేరగాళ్ల పని గురించి తెలియని వారంతా, తమ ఫేవరెట్ క్రికెటర్ ఇలాంటి ఫొటో పెట్టాడేంటని అవాక్కవగా, దీనిపై కుల్ దీప్ ట్విట్టర్ మాధ్యమంగా వివరణ ఇచ్చాడు.

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, అందులో అవాంఛిత పోస్టు చేరిందని, అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని తెలిపాడు. తన పాస్ వర్డ్ ను మరింత బలంగా చేసుకుంటానని, తనను అర్థం చేసుకోవాలని కోరాడు.

More Telugu News