samanta: పారితోషికం తగ్గించుకున్న సమంత!

  • సమంతకి ఇష్టమైన ప్రాజెక్టు 'యూ - టర్న్' 
  • రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ 
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సమంత

'రంగస్థలం' సినిమాతో వచ్చేనెల చివరిలో సమంత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ వుండగానే, మరో వైపున ఆమె తదుపరి చిత్రం షూటింగ్ మొదలైపోయింది. సమంత తదుపరి చిత్రంగా 'యూ - టర్న్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సమంత కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడం వలన ఓ మాదిరి బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. సమంత కెరియర్లో అతి తక్కువ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పట్ల సమంతకి ప్రత్యేకమైన ఆసక్తి ఉండటం వలన, ఆమె తన పారితోషికాన్ని కూడా తగ్గించుకుని చేస్తోందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె డిఫరెంట్ లుక్ తో కనిపించనుందని చెబుతున్నారు.  

More Telugu News