leopard: చిరుత పులి దాడిలో 9 మందికి గాయాలు.. కెమెరాకు చిక్కిన దాడి దృశ్యాలు

  • అసోంలో ఘటన
  • దారితప్పి గ్రామంలోకి ప్రవేశించిన పులి
  • గాయపడ్డవారిలో అటవీ శాఖ అధికారులు కూడా

అసోంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జోర్హత్ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత గ్రామస్తులపై దాడి చేసింది. దాన్ని పట్టుకోవడానికి స్థానికులు, అటవీ శాఖ అధికారులతో కలిసి కర్రలు పట్టుకుని వచ్చారు. వారిపై కూడా చిరుత దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. మొత్తం తొమ్మిది మందిపై ఆ చిరుత దాడి చేసిందని అక్కడి అధికారులు చెప్పారు. గాయాలపాలైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపారు. చిరుత దాడి చేస్తుండగా ఆ దృశ్యాలు కెమెరాకి చిక్కాయి.  

More Telugu News