Virat Kohli: ‘మై వన్ అండ్ ఓన్లీ’ అంటూ కోహ్లీ పోస్ట్ చేసిన ఫొటో ఇది!

  • ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేసిన విరాట్  
  • కౌగిలించుకున్న ఓ జంట పెయింటింగ్ ముందు కోహ్లీ జంట 
  • అదే ఫోజులో ఫొటో దిగిన వైనం
  • ‘మై వన్ అండ్ ఓన్లీ’ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన కోహ్లీ

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో వున్న విరాట్ కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఓ ఫొటో చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ యువతి, యువకుడు కౌగిలించుకుని ఉన్న ఓ పెయింటింగ్ ముందు.. అదే పోజులో కోహ్లీ-అనుష్క జంట ఓ ఫొటో దిగింది. ‘మై వన్ అండ్ ఓన్లీ’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

అయితే, ఈ ఫొటోలో వాళ్లిద్దరి ముఖాలు మాత్రం కనబడటం లేదు. ఈ పోస్ట్ చేసిన గంటలోపే 7.3 లక్షల మంది దీనిని లైక్ చేయడం గమనార్హం. ఇక, నెటిజన్లు చేసిన వ్యాఖ్యల విషయానికొస్తే.. ‘విరాట్, నాకు ఆశ్చర్యమనిపిస్తోంది ఈ ఫొటోను ఎవరు తీశారు..’, ‘చాలా అందంగా ఉంది’, ‘వావ్’ అంటూ ప్రశంసలు కురిపించారు.

More Telugu News