Uttar Pradesh: ఒక్కసారిగా కాలుజారి.. పదో అంతస్తు నుంచి పడిపోయి మృతి చెందిన బాలిక!

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఘటన
  • ఇంట్లో ఒక్కతే వున్న బాలిక 
  • ఆడుకుంటూ బాల్కనీలోకి వెళ్లి అక్కడున్న కుర్చీని ఎక్కిన వైనం 

నాలుగేళ్ల బాలిక ప్ర‌మాద‌వ‌శాత్తు పదో అంతస్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఉన్న  జైపురియా సన్‌రైజ్ గ్రీన్స్‌లో చోటు చేసుకుంది. ఆ స‌మ‌యంలో ఆ చిన్నారి ఇంట్లో ఎవ్వ‌రూ లేర‌ని తెలిసింది. ఇంట్లో ఒంటరిగా నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ బాల్కనీలోకి వెళ్లి అక్కడున్న కుర్చీని ఎక్కింది.

అక్క‌డి నుంచి కింద‌కు చూసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కాలు జారి ఒక్క‌సారిగా ప‌డిపోయింది. స్థానికులు ఈ విష‌యాన్ని గుర్తించి ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు చెప్పారు. నిన్న‌ సాయంత్రం ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ ఆ చిన్నారిని ఇంట్లో ఉంచి బయటకు వెళ్లిన నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

More Telugu News