varma: బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మపైనా కేసు వేస్తున్నా...? నా గురించి ఆమె ఏం మాట్లాడిందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి: వర్మ

  • వర్మ ఓ హోమో సెక్సువల్
  • జై అనే డైరెక్టరే చెప్పాడు
  • అతడ్ని మన మధ్య తిరగనీయకూడదు
  • ఎన్ కౌంటర్ చేసేయాలి
  • టీవీ9 చర్చలో పద్మ ఘాటైన వ్యాఖ్యలు

బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మపైనా తాను కేసు వేస్తున్నట్టు ‘జీఎస్టీ’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. తనను గురించి ఆమె ఏం మాట్లాడారో ఓ సారి పరిశీలించుకోవాలని సూచించారు. వర్మ ఇటీవలే అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఓ పూర్తి అడల్ట్ చిత్రాన్ని తీసి యూట్యూబ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీవీ9 చానల్ చర్చా కార్యక్రమం పెట్టింది. ఈ సందర్భంగా వర్మ తాను చెప్పినట్టుగానే శృంగార చిత్రం తీసి విడుదల చేయడంపై స్పందన కోరగా... తుమ్మలపల్లి పద్మ మాట్లాడుతూ... అన్నీ విడిచేసిన అతని లాంటి వాడిని ఎన్ కౌంటర్ చేసేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

‘‘సిగ్గు లేని వాళ్లను, అన్నీ వదిలేశానంటున్న అలాంటి వాళ్లను ఎన్ కౌంటర్ చేయాలి. ఇంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? గతంతో సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్న సమయంలో ఓ యువతిపై యాసిడ్ పోశారని చెప్పి నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. అలాంటి నాయకులు కావాలి మనకు ఈ రోజు. రాంగోపాల్ వర్మ హోమో సెక్సువల్ అని జై అనే డైరెక్టర్ మనందరి ముందుకు వచ్చి చెప్పడం జరిగింది.

అంటే అతను చేయలేని పనిని ఇలా చేసి అయినా (చిత్రం తీయడం ద్వారా) ఎక్కువ మందిని అలా తయారు చేయాలనుకుంటున్నట్టు ఉంది. అతనిలో సెక్సువల్ సామర్థ్యం లేదు. హోమో సెక్యువల్. ఎర్రగడ్డో, లేక వైజాగో తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. తెలంగాణ ప్రభుత్వం రమ్మీ మాదిరిగానే దీన్ని కంట్రోల్ చేయాలి. ఇటువంటి వ్యక్తులను మన సమాజంలో తిరగనీయకూడదు’’ అని పద్మ నాటి చర్చలో మాట్లాడారు.

More Telugu News