Pakistan: పాకిస్థాన్ స్మగ్లర్ ను కాల్చి చంపిన సైన్యం!

  • ఫిరోజ్ పూర్ సెక్టార్ లో కాల్చివేత
  • స్మగ్లర్ నుంచి 10 కేజీల హెరాయిన్ స్వాధీనం
  • పిస్టల్, సెల్ ఫోన్లు, బుల్లెట్లు స్వాధీనం

పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ పాకిస్థాన్ స్మగ్లర్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సెక్టార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్మగ్లర్ నుంచి 10 కేజీల హెరాయిన్, ఒక చైనా మేడ్ పిస్టల్, రెండు మేగజీన్లు, 17 లైవ్ కార్ట్రిడ్జెస్, పాకిస్థాన్ కరెన్సీ, రెండు మొబైల్ ఫోన్లు, 10 ఫీట్ల పొడవున్న ప్లాస్టిక్ పైపును స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News