YSRCP: బిచ్చగాళ్ల మాదిరిగా కేంద్రం వద్ద చేయి చాచడం దురదృష్టకరం : ఎంపీ కొత్తపల్లి గీత

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి
  • ఏపీకి ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు
  • కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది 

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకునే వారు, బిచ్చగాళ్ల మాదిరిగా కేంద్రం వద్ద చేయి చాచడం దురదృష్టకరమని అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, రైల్వేజోన్ విజయవాడకు రావాలని కొంతమంది లాబీయింగ్ చేయడం వల్లే ఈ విషయంలో ఆలస్యమవుతోందని అన్నారు. కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని విమర్శించారు.

More Telugu News