Train Accident: విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ... ప్రయాణికుడిని రైల్లోంచి తోసేసిన యువకుడు

  • తాను ఎలాగో చనిపోతున్నానని నిందితుడి వ్యాఖ్యలు
  • అతడి మానసిక పరిస్థితిపై ఆరా తీస్తోన్న పోలీసులు
  • మధ్యప్రదేశ్‌లో కామాయని ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్‌ కోచ్‌లో ఘటన

తాను ఎలాగో చనిపోతున్నానని, ఇంకొక‌రిని చంపి చ‌నిపోతాన‌ని విచిత్ర వ్యాఖ్య‌లు చేస్తూ ఓ యువ‌కుడు హ‌త్య చేసిన ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లో కామాయని ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్‌ కోచ్‌లో చోటు చేసుకుంది. రితేజ్‌ అనే వ్యక్తి డోర్ పక్కనే కూర్చుని ప్ర‌యాణిస్తుండ‌గా అదే రైలులో ఉన్న రజ్మల్‌ పాల్‌ అకా రజ్జు అనే వ్యక్తి రితేష్‌ వద్దకు వచ్చాడు. అనంత‌రం విచిత్ర వ్యాఖ్య‌లు చేస్తూ రితేష్‌ను రైలులోనుంచి కింద‌కు తోసేశాడు.

దీంతో రితేష్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. భోపాల్‌ శివారులో ఉన్న సుఖి సెవానియా రైల్వేస్టేషన్‌కు సమీపంలో రితేష్ మృతదేహం ల‌భించింది. వారిద్దరి మధ్య రైలులో ఎలాంటి గొడవ కూడా జ‌ర‌గ‌లేద‌ని, రితేష్ ను ఆ వ్య‌క్తి అన్యాయంగా చంపేశాడ‌ని పోలీసుల‌కు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగానే ఉందా? అనే విష‌యంపై కూడా విచారిస్తున్నారు.

More Telugu News