ntr: ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేసేశారు

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • మార్చి 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్  

తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. ఈ మధ్య 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో యూత్ ను అలరించిన ఆమె, ప్రస్తుతం ' సాక్ష్యం' సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా చేస్తోంది. మహేశ్ బాబు 25వ సినిమాలో కథానాయికగా కూడా ఆమె పేరే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమా యూనిట్ త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడిచేయనున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని సంస్థ వారు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మార్చి రెండవ వారంలో ఆరంభించనున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపిస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్టుగా ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కి .. సంగీత దర్శకుడిగా అనిరుథ్ కి అవకాశం దక్కకపోవడం విశేషం.    

More Telugu News