bellamkonda srinivas: 'సాక్ష్యం' తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఇదేనట!

  • చివరి దశలో బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం'
  • ఓంకార్ తో సినిమా అనేది ప్రచారం మాత్రమే 
  • నూతన దర్శకుడితో ఈ నెల 23న సెట్స్ పైకి

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా 'సాక్ష్యం ' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, శ్రీనివాస్ తదుపరి సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి. 'సాక్ష్యం' తరువాత ఓంకార్ దర్శకత్వంలో శ్రీనివాస్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.

 నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుందనీ, మార్చి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు వుండనున్నారని అంటున్నారు. మల్టీ డైమన్షన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  

More Telugu News